ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో భారత్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో భారత్ జోడి సానియా మీర్జా-మహేశ్ భూపతి విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏడోసీడ్ సానియా-భూపతి 7-6 (7/3), 6-1తో అన్సీడెడ్ క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్)-సాంటియాగో గోంజాలెజ్ (మెక్సికో)పై విజయం సాధించారు. 73 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలిసెట్లో ఓ దశలో 3-5తో వెనుకబడ్డ సానియా జోడి తర్వాత పుంజుకుంది. తొమ్మిదో గేమ్ను బ్రేక్ చేసి ఆపై సర్వీస్ను నిలబెట్టుకుని స్కోరును సమం చేసింది. |