అప్లికేషన్ అలర్ట్ గ్రూప్-4

02/06/2012 21:21

అప్లికేషన్ అలర్ట్ గ్రూప్-4   Namaste telangana .net news

ఈ వారం అప్లికేషన్ అలర్ట్ శీర్షిక కింద గ్రూప్-4 పోస్టుల వివరాలు చూద్దాం.ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరీ పోస్టులైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 1338
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2012
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 22-06-2012
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ముగింపు: 24-06-12
పరీక్ష తేదీ : 11-08-2012
పూర్తి వివరాలకు చూడవలసిన వెబ్‌సైట్: www.apspsc.gov.in
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ విధానం
ఎపిపిఎస్‌సి వెబ్‌సైట్ ః www.apspsc.gov.in ఓపెన్ చేసి గ్రూప్-4 నోటిఫికేషన్‌లోకి వెళ్ళి ‘గెట్ చలాన్’ అన్నది క్లిక్ చేసి వ్యక్తి గత వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు ఫీజుకు సంబంధించి చలాన్ ప్రింట్ తీసుకుని ఏదైనా ఎస్.బి.ఐ బ్రాంచ్‌లో ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత బ్యాంక్ వారు ఇచ్చే జనరల్ నంబరును మరుసటిరోజు తిరిగి వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు గ్రూప్-4 పూర్తి దరఖాస్తు వస్తుంది. దరఖాస్తులో అన్ని వివరాలను జాగ్రత్తగా నింపి సబ్‌మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్‌మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడితో వచ్చే కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.